మిస్ వరల్డ్ పోటీల్లో ఆరోపణలపై విచారణ

మిల్లా మాగీ పోటీల నిర్వహణపై సంచలన ఆరోపణలు

On
మిస్ వరల్డ్ పోటీల్లో ఆరోపణలపై విచారణ


విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం

ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలు
72వ పోటీలను హైదరాబాద్ లో నిర్వహణ

 

సాయిసూర్య-తెలంగాణడెస్క్:ప్రపంచ సుందరీ పోటీలు అంటే...ఇప్పుడే కాదు...ఎప్పుడూ యువతలో క్రేజ్. వ్యాపారస్థులు, పెట్టుబడిదారులు మిస్ వరల్డ్ పోటీలకు పోటెత్తుతారు. అందాల తారల, హోయలు, సౌందర్యానికి మంత్రముగ్దులవుతారు. మిస్ వరల్డ్ పోటీలంటే ఇదే కాదు... దాని వెనుక సామాజిక అంశాలు కూడా ఉంటాయి. ఐతే 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో జరగడం గర్వకారణం. కానీ దారుణమైన ఆరోపణలు రావడమే...ఇబ్బందికరం. తెలంగాణలో 72వ మిస్ వరల్డ్ పోటీలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. తెలంగాణ సాంస్కృతిక, సంప్రదాయాలు ప్రపంచానికి చాటిచెప్పే అద్భుత అవకాశం కలిగింది. ప్రపంచ దేశాల సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మిస్ వరల్డ్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అలాగే భారత్ లోని విభిన్న సంస్కృతి సంప్రదాయాలను ఆస్వాధించే అవకాశం కలిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తోంది. పర్యాటక ప్రాంతాలను సందర్శింపజేయడం, దాని ద్వారా టూరిజం ప్రోత్సహించడం, బ్రాండ్ హైదరాబాద్ ను ప్రపంచ దేశాలకు తెలియజేసే ప్రయత్నం చేసింది. ఇదంతా బాగానే ఉన్నా తాజాగా మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకున్న సుందరీమణి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. 

images (8)

మిస్ వరల్డ్ పోటీలు గతంలో ముంబైలో జరిగాయి. ఈ ఈవెంట్ నిర్వహించే అద్భుత అవకాశం కలిగింది. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోంది. కానీ ఇలాంటి ఆరోపణలు విచారకరం. 

images (7)

మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ హైదరాబాద్ లో ఉన్న సమయంలో ధనవంతులైన పురుష స్పాన్సర్లను అలరించడంలో ఎంతో ఒత్తిడికి గురయ్యా అంటూ కామెంట్ చేశారు. దీంతో దీనిపై రాజకీయంగా చర్చకు తెరలేచింది. దేశ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. 

Read More కవిత లేఖ రిలీజ్ చేసింది వారేనా...? 

దీంతో తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మిల్లా మాగీ ఆరోపణలపై విచారణ చేయాలని సూచించింది. ఇందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి షికా గోయల్, ఐపీఎస్ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. పోటీల తీరు, నిర్వహణ ఇబ్బందులు వంటివి అడిగి తెలుసుకున్నారు. మిల్లా మాగీ పాల్గొన్న డిన్నర్ లో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుని విచారించనుంది. 

Read More బ్రేకింగ్ :తెలంగాణలో మరొకొత్త పార్టీ ఆవిర్భవించనుందా?బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ పుట్టుకురానుందా?

ప్రభుత్వం విచారణకు ఆదేశించడం వరకు సరే. కానీ ఇలాంటి ఆరోపణలు ఏ మాత్రం మంచివి కావనే భావన అందరిలో కలుగుతోంది. పోటీలను హుందాగా నిర్వహించి...పేరు ప్రతిష్టలు పెంచేవిలా చేసుంటే...తెలంగాణ ప్రపంచ దేశాల్లో గుర్తింపు లభించేది అంటున్నారు. ఇప్పటికే పోటీదారుల కాళ్లు కడిగించారని ఆరోపణలతో కొంత డ్యామెజ్, ఇఫ్పుడు మరింత డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామెజ్ కంట్రోల్ ఎలా చేస్తారో చూడాలి. 

Read More hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు. ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు

Views: 4

About The Author

Latest News

hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు.  ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు. ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు
తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా: గంగరాయి చెరువు మాయం అవుతోంది. కబ్జాదారులు చెరువును పూడ్చేస్తూ.. కనుమరుగు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. హైడ్రా స్పందన కరువైంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ...
Kavitha :బీఆర్ఎస్‌లోని అగ్రనేతలే టార్గెట్‌గా ఆమె విమర్శనాస్త్రాలు . కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు
నిషేధిత ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు వద్దు
దోపిడీకి అడ్డాలుగా మీసేవ సెంటర్లు ఏ సేవ కావాలన్నా..భారీగా ఛార్జీ
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రెడీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్
Fake IAS :ఫేక్ ఐఏఎస్ కిలేడి ఆట కట్టించిన పోలీసులు
Banoth Madanlal:గుండెపోటుతోమాజీ ఎమ్మెల్యేమృతి