తెలంగాణ కేబినెట్ విస్తరణకు రెడీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్

రాములమ్మకు పదవి దక్కనుందని జోరుగా ప్రచారం
ఆశవహుల ఆశలు నిజం అవుతాయా?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పదవి వరిస్తుందా?
సాయి సూర్య- తెలంగాణ బ్యూరో:తెలంగాణ కెబినెట్ విస్తరణ కొలిక్కి వచ్చినట్టు ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తున్నాయి. ఎన్నాళ్లుగా వేచిన ఉదయం రాబోతుంది అన్నట్టుగా...మంత్రివర్గ విస్తరణ జరిగిపోనుంది. ఐతే మంత్రి వర్గ విస్తరణ జరిగితే...పదవులు ఎవరికి దక్కనున్నాయి. ఆశవహులను పదవి వరిస్తుందా? కొత్త వారు మంత్రివర్యులుకానున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే తెలియనుంది. ఐతే తాజాగా రాములమ్మ పేరు మంత్రివర్గ విస్తరణలో వినిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీగా పదవి దక్కించుకున్న ఆమె...మంత్రిగా మారనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది.
విజయశాంతి అలియాస్ రాములమ్మ. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకం. తెలంగాణ కోసం పార్టీ పెట్టి, పోరాడి తనకంటే ప్రత్యేకతను చాటుకున్నారు. బీఆర్ఎస్ అధినేతతో కలిసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆమె పాత్ర కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పార్టీ పెట్టిన తర్వాత అప్పటి టీఆర్ఎస్ లో విలీనం చేసి...కొన్నాళ్లు ఆ పార్టీ ఎంపీగా కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ లో చేరారు. కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. అక్కడి నుంచి భారతీయ జనాతా పార్టీలో చేరారు. ఐతే అనుకోని కారణాల వల్ల బీజేపీని వీడి మల్లీ కాంగ్రెస్ లోకి వచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక...కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్నారు. కానీ అనూహ్యంగా విజయశాంతి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. దీంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది.
తాజాగా మంత్రి వర్గ విస్తరణలో విజయశాంతి పేరు వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు, స్థానిక అంశాలను పరిధిలో తీసుకొని మంత్రి పదవులకు నేతలను సెలెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మహిళా కోటలో విజయశాంతికి అవకాశం కల్పించే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు...ఇప్పుడు మంత్రుల్లో కొందరిని తొలగించి...కొత్త వారికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఇప్పటికే ప్రేమ్ సాగర్ రావు, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, శ్రీహరి వంటి వారు పదవుల కోసం వేయిట్ చేస్తున్నారు. ఐతే త్వరలో జాబితా వెలువడనున్నట్టు సమాచారం. చూడాలి మరి ఎవరిని పదవులు వరిస్తాయో..
About The Author
