Kavitha :బీఆర్ఎస్లోని అగ్రనేతలే టార్గెట్గా ఆమె విమర్శనాస్త్రాలు . కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు

సాయి సూర్య- తెలంగాణ బ్యూరో:రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు పెంచారు. బీఆర్ఎస్లోని అగ్రనేతలే టార్గెట్గా ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ఇవాళ కవిత మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ.. దేశం బయట సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు పెట్టుకుని తనపై కొందరు కుట్రలు చేస్తున్నారు ఆరోపించారు. ఆ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపించండి తనపై కాదని హితవు పలికారు. నాకు నీతులు చెబుతున్న వాళ్లంతా నీళ్ల వివాదంపై మాట్లాడితే బాగుంటుందని ధ్వజమెత్తారు. ట్విట్టర్లో ట్వీట్లు చేస్తే సరిపోదని.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆడబిడ్డ మీద పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే ఏం రాదని.. తాను అసలే మంచిదాన్ని కాదని.. నోరు విప్పితే తట్టుకోలేరని అన్నారు. కేసీఆర్ను నడిపించేంత పెద్దోళ్లా మీరు అంటూ కవిత ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పెయిడ్ సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారని ఆరోపించారు. మీడియాతో చిట్చాట్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా? అని ప్రశ్నించారు. లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారన్నారు. సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఎంపీగా ఓడించారని ఆరోపించారు. అదే జిల్లాలో ప్రొటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ ఇచ్చారని వివరించారు కవిత. లీకు వీరులను ఎండగట్టమంటే గ్రీకు వీరుల్లా తనపై ప్రతాపం చూపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీపై మాట్లాడాలి కానీ.. తనపై దాడి చేస్తే ఎలా?’’ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీని ఎలాగైనా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందన్నారు.
About The Author
