Fake IAS :ఫేక్ ఐఏఎస్ కిలేడి ఆట కట్టించిన పోలీసులు
యువకులకు ఘరానా లేడీ వలపువల

ఏడాది క్రితం ఓ వైద్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ 5 లక్షలు వసూలు
పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు
సాయి సూర్య- తెలంగాణ బ్యూరో:వలపువల వేయడంలో ఆమెకు సాటిలేరు. అందానికి ఫెక్ అధికారం తోడైంది. దీంతో ఎంతో మందిని మోసం చేసింది. ఒక్క కేసు కాదు..ఆమెపై అనేక ప్రాంతాల్లో కేసులు ఉన్నాయి. అంతే కాదు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది.
నల్గొండలో ఫేక్ ఐఏఎస్ డాక్టర్ ప్రత్యూష లీలలు మామూలుగా లేవు. ఐఏఎస్ గా చలామణి అవుతున్న యువతి మిర్యాలగూడ (మం) లావుడి తండాకు చెందిన సరిత అలియాస్ ప్రత్యూష గా చెలామణి అవుతుంది.
ఓ యువకుడిని డబ్బు ఇవ్వకుంటే చంపేస్తానంటూ బెదిరించిన ఘటనలో కేసు నోమోదైంది.
మూడు రోజుల క్రితం 100 కాల్ ద్వారా వనస్థలిపురం పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన సరిత...డీఎస్పీ సతీమణి అంటూ ఖాకీలకు దమ్కీ ఇచ్చింది.

గతంలో యువతి మర్డర్ అంటూ హైదరాబాద్ లోని ఓ డీఎసీపీకి,మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని ఓ సీఐ కి కాల్ చేసి మొబైల్ స్విచ్ఛాఫ్ చేసింది. విద్యార్ధిని ముసుగులో హాస్టల్ లో ఉంటూ...అమ్మాయిల దగ్గర నగదు,మొబైల్స్ ఎత్తుకెలినది.
కొన్నాళ్లుగా డబ్బున్న వారినే టార్గెట్ చేస్తూ తాను డాక్టర్, ఐఏఎస్ అంటూ యువకులను ట్రాప్ చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోంది. సరితపై మలక్పేట,చైతన్యపురి,ఉప్పల్,నల్గొండ టూ టౌన్, మిర్యాలగూడ వన్ టౌన్ పీఎస్ లో కేసులు ఉన్నాయి. అలాగే నార్కట్ పల్లి,నల్గొండ వన్ టౌన్ పీఎస్ లలో చీటింగ్ కేసు ఉంది. ఐతే ఎట్టకేలకు తాజాగా చోరీ కేసులో సరితను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు. ఏడాది క్రితం ఓ వైద్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ 5 లక్షలు వసూలు చేసింది. ఐతే.. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు అసలు బండారం బయటికి వచ్చింది.
About The Author
