కవిత లేఖతో కాంగ్రెస్కి వచ్చే నష్టం ఏం లేదు.

సాయి సూర్య-తెలంగాణ: డెస్క్:కేసీఆర్కి రాష్ట్ర విభజన అంశంతో ఓటేశారు కాంగ్రెస్ కి పాలన చూసి ఓటేస్తారు ప్రజలుకవిత కొత్త పార్టీ అనే చర్చ నడుస్తుందిబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్కు రాసిన ఆరు పేజీల లేఖపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. వరంగల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ. కవిత లేఖ వల్ల కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో బలంగా ఉందని.. అలాంటి లేఖలు వంద పుట్టుకొచ్చినా తమకు జరిగే ఏమీ లేదని, ఈ గొడవ వల్ల గులాబీ పార్టీకే తీరని నష్టమని స్పష్టం చేశారు.
కవిత లేఖ బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ పంచాయితీని బయటపెట్టిందన్నారు. కేటీఆర్ ఉండగా వారసత్వం కూతురుకు ఎలా దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్ - బీజేపీతో రహస్య ఒప్పందాలు బయటపడ్డాయని ఆరోపించారు. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్కు అనుకూల వాతావరణాన్ని కల్పించిందని జగ్గారెడ్డి నొక్కిచెప్పారు.
About The Author
