కవిత లేఖ‌తో కాంగ్రెస్‌కి వచ్చే నష్టం ఏం లేదు.

On
కవిత లేఖ‌తో కాంగ్రెస్‌కి వచ్చే నష్టం ఏం లేదు.
బలంగా లేని పార్టీ బీజేపీ :జగ్గారెడ్డి

సాయి సూర్య-తెలంగాణ: డెస్క్:కేసీఆర్‌కి రాష్ట్ర విభజన అంశంతో ఓటేశారు కాంగ్రెస్ కి పాలన చూసి ఓటేస్తారు ప్రజలుకవిత కొత్త పార్టీ అనే చర్చ నడుస్తుందిబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ. కవిత లేఖ వల్ల కాంగ్రెస్ కు వచ్చిన నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 64 సీట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో బలంగా ఉందని.. అలాంటి లేఖలు వంద పుట్టుకొచ్చినా తమకు జరిగే ఏమీ లేదని, ఈ గొడవ వల్ల గులాబీ పార్టీకే తీరని నష్టమని స్పష్టం చేశారు.

కవిత లేఖ బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబ పంచాయితీని బయటపెట్టిందన్నారు. కేటీఆర్ ఉండగా వారసత్వం కూతురుకు ఎలా దక్కుతుందని వ్యాఖ్యానించారు. ఈ లేఖ ద్వారా బీఆర్ఎస్ - బీజేపీతో రహస్య ఒప్పందాలు బయటపడ్డాయని ఆరోపించారు. ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణాన్ని కల్పించిందని జగ్గారెడ్డి నొక్కిచెప్పారు.

Views: 64

About The Author

Latest News

hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు.  ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు hydra:హైడ్రాని లెక్కచేయని అక్రమార్కులు. ఎఫ్ టి ఎల్ భూముల్లో మట్టి వస్తున్న కబ్జాదారులు
తుర్కయంజాల్, రంగారెడ్డి జిల్లా: గంగరాయి చెరువు మాయం అవుతోంది. కబ్జాదారులు చెరువును పూడ్చేస్తూ.. కనుమరుగు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. హైడ్రా స్పందన కరువైంది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ...
Kavitha :బీఆర్ఎస్‌లోని అగ్రనేతలే టార్గెట్‌గా ఆమె విమర్శనాస్త్రాలు . కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత జోరు
నిషేధిత ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు వద్దు
దోపిడీకి అడ్డాలుగా మీసేవ సెంటర్లు ఏ సేవ కావాలన్నా..భారీగా ఛార్జీ
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రెడీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్
Fake IAS :ఫేక్ ఐఏఎస్ కిలేడి ఆట కట్టించిన పోలీసులు
Banoth Madanlal:గుండెపోటుతోమాజీ ఎమ్మెల్యేమృతి