పరిగి నియోజకవర్గం మన్నెగూడలో డీసీసీబీ నూతన శాఖ ఆవిష్కరణ
On

పరిగి శాసనసభ్యులు టీ రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం
రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో ది హైదరాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ (డీసీసీబీ) నూతన బ్రాంచ్ ప్రారంభమైంది. వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం, మన్నెగూడలో ఈ బ్రాంచ్ ఏర్పాటు చేశారు. ఈ శాఖను పరిగి శాసనసభ్యులు డా. టీ.రామ్మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్లు పట్లోళ్ల అంజి రెడ్డి, కిషన్ నాయక్, మొగులయ్య, బ్యాంక్ సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, జీఎంలు ఫణి రామ్, ప్రభాకర్ రెడ్డి, పూడూర్ సొసైటీ చైర్మన సతీష్ రెడ్డి, గండీడ్ సొసైటీ చైర్మన్ లక్ష్మినారాయణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Views: 2
Tags:
Latest News
01 May 2025 17:53:02
తుర్కయంజాల్-సూర్య టుడే:తుర్కయంజాల్ మున్సిపల్ లోని శ్రీరామ్ నగర్ కాలనీ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు బుధవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యున్నతమైన ఫలితాలు సాధించి తమకు...