రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి

తుర్కయంజాల్ (సాయి సూర్య):రాష్ట్రవ్యాప్తంగా అన్ని గొర్రెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలని GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్ డిమాండ్ చేశారు. హయత్ నగర్ కోహెడను GMPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్, GMPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మల్లేష్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ...

బాధిత రాసూరి శ్రీశైలం కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ నవీన్ను కలిసి ధైర్యం చెప్పారు. ఆ తర్వాత బాధితులతో కలిసి హయత్ నగర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ను కలిశారు. హైదరాబాద్, రంగారెడ్ది, మేడ్చల్, భువనగిరి జిల్లాల గ్రామాల్లో గొర్రెల దొంగతనాలు పెరిగిపోయాయని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు.

తాజాగా ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోలింగ్ పెంచాలని..సీ.సీ. కెమెరాల ఏర్పాటుతో సామూహిక గొర్రెల షెడ్లు నిర్మించాలన్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. హయత్ నగర్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్పందిస్తూ రెండ్రోజుల్లో దుండగులను పట్టుకుంటామని అన్నారు.
✍️✍️అవినీతి పై అక్షరం తూట సాయి సూర్య,